శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాతో యుద్ధం సాగుతుంటే... మరోవైపు శివాలయంలో సాధువుల హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు సాధువులు అనుమానాస్పదంగా మృతి చెందరాు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ బులంద్‌షహర్‌లో జరిగింది. మొన్న పాల్ ఘర్ ఘటన మరువకముందే.. మంగళవారం తెల్లవారుజామున యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. బులంధర్‌లోని ఓ ఆలయంలో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.