ఉచితంగా ఇస్తున్నార‌ని గుంపులుగా ఎగ‌బ‌డిన జ‌నం..

క‌రోనా వైర‌స్ వేళ దేశ‌వ్యాప్తంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లంతా గుమిగూడ‌కుండా, ఎవ‌రి ఇళ్ల‌లో వారే ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది. భౌతిక దూరాన్ని పాటించ‌డంతోపాటు, ఎవ‌రికి వారే సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని తెలిపింది. అయితే దేశంలోని చాలా చోట్ల లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను కొంత‌మంది పాటించ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ త‌మ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. ఇత‌రుల‌కు థ్రెట్‌గా మారుతున్నారు. తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన సంఘ‌ట‌న షాక్‌కు గురిచేస్తోంది.